AP News.. కర్నూలు: జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం
ABN , Publish Date - Mar 19 , 2024 | 07:02 AM
కర్నూలు: నగరంలో జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆదివారం బూత బంగ్లాలోని అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ క్లీన్ చేస్తుండగా హెచ్వోడి గదిలోకి మూగ చెవుడు గల ఐదేళ్ల బాలుడు సుదిత వెళ్లాడు. అది గమనించని ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ థియేటర్ గది తలుపులు వేశారు.
కర్నూలు: నగరంలో జీజీహెచ్ (GGH) సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆదివారం బూత బంగ్లాలోని అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ (Anesthesia Operation Theatre) క్లీన్ చేస్తుండగా హెచ్వోడి (HOD) గదిలోకి మూగ చెవుడు గల ఐదేళ్ల బాలుడు సుదిత వెళ్లాడు. అది గమనించని ఆసుపత్రి సిబ్బంది (Hospital Staff) ఆపరేషన్ థియేటర్ గది తలుపులు వేశారు. దీంతో ఆ బాలుడు 21 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. గదిలో ఉన్న ఫ్రిజ్లోని నీరు తాగి కడుపు నింపుకున్నాడు. మరోవైపు తమ కుమారుడు కనిపించడం లేదని బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆపరేషన్ థియేటర్ గది శుభ్రం చేసేందుకు సిబ్బంది తలుపులు తీశారు. బాలుడు కనిపించడంతో అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.