సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు : జేసీ
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:08 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్), జూలై 15: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో ఎక్కువ శాతం భూముల సర్వేపై ఉన్నాయన్నారు. డీఆర్వో మధుసూదన్ రావు, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.