‘వన్యప్రాణుల సంరక్షణలో నిర్లక్ష్యం తగదు’
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:49 AM
నల్లమలలో వన్యప్రాణుల సంర క్షణలో నిర్లక్ష్యం తగదని నంద్యాల జిల్లా అటవీశాఖ డిప్యూటీ డైరెక్టరు అనురాగ్మీనా అన్నారు.
రుద్రవరం, ఏప్రిల్ 17: నల్లమలలో వన్యప్రాణుల సంర క్షణలో నిర్లక్ష్యం తగదని నంద్యాల జిల్లా అటవీశాఖ డిప్యూటీ డైరెక్టరు అనురాగ్మీనా అన్నారు. బుధవారం రుద్రవరం రేంజ్లో పర్యటించారు. సాసర్ ఫీట్, బేస్ క్యాంపులను పరిశీలించారు. ప్రొటె క్షన్ వాచర్లను బేస్క్యాంపుల్లో సౌకర్యలపై అడిగి తెలుసుకున్నారు. పెద్దపులుల సంఖ్య పెరిగిందని చెప్పారు. రేంజర్ శ్రీపతినాయుడు, డిప్యూటీ రేంజన్ ముర్తుజావలి, సిబ్బంది ఉన్నారు.