ఎమ్మెల్యేలను అభినందించిన నారా లోకేశ్
ABN , Publish Date - Jun 11 , 2024 | 11:46 PM
మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ జిల్లా ఎమ్మెల్యేలను అభినందించారు.
![ఎమ్మెల్యేలను అభినందించిన నారా లోకేశ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు(అర్బన్), జూన్ 11: మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ జిల్లా ఎమ్మెల్యేలను అభినందించారు. మంగళవారం విజయవాడలోని ఏ కన్వెక్షన్ హాలులో ఎన్డీయే కూటమి శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు టీజీ భరత్, బొగ్గుల దస్తగిరి, బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, గౌరు చరిత, కేఈ శ్యాంబాబుతో పాటు నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలను పలకరించారు. ఎన్నికైన ఎమ్మెల్యేలను పేరుపేరునా నారా లోకేశ్ అభినందించారు. ఈ సమావేశంలో శాసన సభా పక్షనేతగా నారా చంద్రబాబు నాయుడును జనసేన, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.