Share News

చంద్రబాబును కలిసిన మీనాక్షినాయుడు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:52 PM

ఆలూరు నియోజకవర్గంలో ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.

చంద్రబాబును కలిసిన మీనాక్షినాయుడు

ఆదోని, ఏప్రిల్‌ 19: ఆలూరు నియోజకవర్గంలో ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అసంతృప్తికి లోనైన మీనాక్షి నాయుడిని చంద్రబాబునాయుడు బుజ్జగించారు. పార్టీ పుట్టినప్పటి నుండి ఉన్న మీనాక్షినాయుడును గుర్తిస్తున్నామని, సమయం వచ్చినప్పుడు ఆయన ఆశించినదానికన్నా మంచి చేయాలని తనకు ఉందని తెలిపినట్లు సమాచారం. టీడీపీ కార్యక్రమం సక్సెస్‌ చేయాలని మీనాక్షినాయుడుకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చినా అది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తారని, అలాంటి వ్యక్తికి పొత్తు వల్ల టికెట్‌ ఇవ్వలేకపోవడం బాధగా ఉందని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. ఏదేమైనా మీనాక్షినాయుడును గుర్తుపెట్టుకున్నామని, ఎన్నికల్లో కలిసి మెలిసి పనిచేసి పార్థసారథిని గెలిపించాలని ఆయన సూచించినట్లు తెలిసింది. చంద్రబాబును కలిసిన వారిలో మీనాక్షినాయుడు కుటుంబసభ్యులు.. సీనియర్‌ నాయకులైన ఉమాపతినాయుడు, వెంకట్రామినాయుడు, రంగస్వామి నాయుడు, యువ నాయకులు మారుతి నాయుడు, తెలుగు యూత్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌ చౌదరి ఉన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:52 PM