ఆత్మకూరులో భారీ అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:50 PM
ఆత్మకూరు పట్టణంలోని రఘునాథ్ సెంటర్లో నర్సింగ్ భాన్సింగ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న శివజ్యోతి ట్రేడర్స్కు చెందిన పాత ఇనుప సామాను అంగడిలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
ఆత్మకూరు రూరల్, ఏప్రిల్ 18: ఆత్మకూరు పట్టణంలోని రఘునాథ్ సెంటర్లో నర్సింగ్ భాన్సింగ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న శివజ్యోతి ట్రేడర్స్కు చెందిన పాత ఇనుప సామాను అంగడిలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పాతసామాను, ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు, ఇనుప సామాను, పేపర్లు, అట్టలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు గమనించి దుకాణ యజమానికి, అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. అప్పటికే మంటలు చెలరేగడంతో ఆర్పడం కష్టమైంది. గురువారం మధ్యాహ్నానికి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని భానుసింగ్ కోరాడు.