టీడీపీలోకి భారీగా చేరికలు
ABN , Publish Date - Feb 20 , 2024 | 01:23 AM
బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి షాక్ల మీద షాక్ తగులుతున్నాయి.
![టీడీపీలోకి భారీగా చేరికలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బనగానపల్లె, ఫిబ్రవరి 19: బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి షాక్ల మీద షాక్ తగులుతున్నాయి. బీసీ జనార్దన్రెడ్డి సమక్షంలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. సోమవారం కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి బీసీ టీడీపీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. కనకాద్రిపల్లె వైసీపీ నాయకులు దూదేకుల మాబుషా(బొజ్జన్న), దూదే కుల మద్దిలేటి, దూదేకుల కంబగిరి రాముడుతోపాటు 40 కుటుంబాలు బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో టీడీపీలో చేరారు. వీరికి బీసీ జనార్ద న్రెడ్డి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపగ లిగిన ఒకే ఒక నాయకుడు బీసీ జనార్దన్రెడ్డి అన్నారు. బీసీ మాట్లా డుతూ వచ్చే రెండు నెలలు సమష్టిగా పనిచేసి వైసీపీ అరాచక పాలన కు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.