అమ్మ పేరుతో మొక్కలు నాటుదాం: గౌరు చరిత
ABN , Publish Date - Aug 25 , 2024 | 12:21 AM
ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పిలుపునిచ్చారు.
కల్లూరు, ఆగస్టు 24: ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పిలుపునిచ్చారు. శనివారం స్పార్టన గ్రీన సంస్థ ఆధ్వర్యంలో 21వ వార్డు పార్థసారధినగర్ పార్క్లో నిర్వహించిన తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భాష్యం స్కూల్ విద్యార్థుల తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గౌరుచరిత మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె. పార్వతమ్మ, పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, స్పార్టన గ్రీన సంస్థ అఽధ్యక్షుడు సయిం, చరిత, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.