వైసీపీని గద్దె దించుదాం: గౌరు చరిత
ABN , Publish Date - Feb 01 , 2024 | 12:28 AM
రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని టీడీపీ పాణ్యం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
![వైసీపీని గద్దె దించుదాం: గౌరు చరిత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కల్లూరు, జనవరి 31: రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని టీడీపీ పాణ్యం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. బుధవారం కల్లూరు అర్బన్ 31వ వార్డు శరీన్నగర్లో చేపట్టిన రచ్చబండ, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో ఇంటింటీకీ తిరిగి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె టీడీపీ మేనిఫేస్టోను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు, దోపిడీ తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదని ఆరోపించారు. కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి శైలజయాదవ్, మాజీ ఎంపీపీ వాకిటి మాధవి, కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్ యాదవ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, మాదేష్, వంగాల జనార్దన్రెడ్డి, ఆదం, మల్లికార్జున, రామకృష్ణ. క్రిష్ణన్న, సువర్ణ, రేణుక, జనసేన నాయకులు షబ్బీర్, తిరుమలేష్, సునీల్ పాల్గొన్నారు.