టీడీపీ కూటమిని గెలిపించుకుందాం
ABN , Publish Date - Mar 18 , 2024 | 12:11 AM
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకుందా మని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత పిలుపునిచ్చారు.
![టీడీపీ కూటమిని గెలిపించుకుందాం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, మార్చి 17: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకుందా మని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత పిలుపునిచ్చారు. ఆదివా రం కల్లూరు అర్బన్ 32వ వార్డు ముజఫర్నగర్లోని టైలర్స్ కాలనీలో ఆమె శంఖా రావం, సూపర్సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత పంపిణీ చేశా రు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ జగన్రెడ్డి ప్రజావ్యతిరేక పాలనై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి కూటమి గెలుపునకు కృషి చేయాలని గౌరుచరిత పిలుపుని చ్చారు. కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి పీయూ మాదన్న, వార్డు నాయకులు నాగ రాజు, సోమన్న, బందేనవాజ్, కేవీ శేఖర్, రవిప్రకాష్రెడ్డి, కోటేష్ గౌడ్, జనసేన నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.