Share News

నేడు డోన్‌లో కోట్ల బహిరంగ సభ

ABN , Publish Date - Mar 01 , 2024 | 01:02 AM

డోన్‌ పట్టణంలో శుక్రవారం నిర్వహిస్తున్న టీడీపీ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేశారు.

నేడు డోన్‌లో కోట్ల బహిరంగ సభ
మాట్లాడుతున్న కోట్ల రాఘవేంద్రరెడ్డి

భారీగా తరలిరానున్న తెలుగు తమ్ముళ్లు

విజయవంతం చేయాలని కోట్ల రాఘవేంద్ర రెడ్డి పిలుపు

డోన్‌, ఫిబ్రవరి 29: డోన్‌ పట్టణంలో శుక్రవారం నిర్వహిస్తున్న టీడీపీ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేశారు. డోన్‌ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి పేరును ప్రకటించిన తర్వాత.. మొదటి సారిగా డోన్‌కు వస్తుండటంతో ఆయనకు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాల నాయకులు ఈ సభకు తరలిరానున్నారు. దీంతో డోన్‌లో ఎక్కడా చూసినా తెలుగు త మ్ముళ్ల సందడి కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాలో డోన్‌ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. కోట్ల తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, వలసల రామకృష్ణ, కోట్రికే ఫణిరాజ్‌, ఓబులాపురం శేషిరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ లక్కసాగరం లక్ష్మీరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ టీఈ కేశన్న గౌడు, మర్రి రమణ, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, డోన్‌, ప్యాపిలి, బేతం చెర్ల మండలాల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, గండికోట రామ సుబ్బయ్య, ఎల్లనాగయ్య, ఓంప్రకాష్‌, ఎరుకల చెరువు శివ, మాజీ ఎంపీ టీసీ బుగ్గన ప్రసన్నలక్ష్మి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పోలూరు వెంక టేశ్వరరెడ్డి ఏర్పాట్లు చూస్తున్నారు. గుత్తి రోడ్డులోని అమ్మ హోటల్‌ సర్కిల్‌ నుంచి పాతబస్టాండు మీదుగా మధు ఫంక్షన్‌ హాలు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.

జిల్లా టీడీపీ నాయకుల రాక: పట్టణంలో నిర్వహించే టీడీపీ బహిరంగ సభకు కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఉమ్మడి జిల్లాల టీడీపీ నాయ కులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో జిల్లా టీడీపీ నాయకులు భారీ గా తరలివస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రులు కేఈ ప్రభాకర్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌, భూమా అఖిలప్రియ, మా జీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు, కర్నూలు, నంద్యాల జిల్లాల టీడీపీ అధ్య క్షుడు బీటీ నాయుడు, మల్లెల రాజశేఖర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సోమి శెట్టి వెంకటేశ్వర్లు తదితరులు తరలివస్తున్నారు.

టీడీపీ సభను విజయవంతం చేద్దాం..

టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోట్ల రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో పార్టీ నాయ కులతో ఆయన సమావేశమై టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో నమ్మ కంతో డోన్‌ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డిని ప్రకటిం చారన్నారు. సమన్వయంతో సభ విజయవంతమయ్యేలా చూడాలన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 01:02 AM