Share News

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:14 AM

మహానంది మండలంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. మొదటి నుంచి వైసీపీలో ఉండి ఎంపీపీ పదవి చేపట్టిన సీతారామపురం గ్రామానికి చెందిన బుడ్డారెడ్డి యశస్వీనిరెడ్డి సీతారామపురం గ్రామ సర్పంచ్‌ తేజస్వీనిరెడి, వారి తండ్రి బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

మహానంది, ఏప్రిల్‌ 19: మహానంది మండలంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. మొదటి నుంచి వైసీపీలో ఉండి ఎంపీపీ పదవి చేపట్టిన సీతారామపురం గ్రామానికి చెందిన బుడ్డారెడ్డి యశస్వీనిరెడ్డి సీతారామపురం గ్రామ సర్పంచ్‌ తేజస్వీనిరెడి, వారి తండ్రి బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అలాగే తిమ్మాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ నాగభూపాల్‌రెడ్డి, బుక్కాపురం కందుల భూపాల్‌రెడ్డి, మహానంది దేవస్థానం మాజీ ధర్మకర్త గంగిశెట్టి మల్లిరార్జునరావు, బుక్కాపురం జయరాముడు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం భారీ సంఖ్యలో ప్రత్యేక వాహనాల్లో ఆలూరుకు వెళ్లి టీడీపీలో చేరారు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు, నంద్యాల ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి తదతరులు ఉన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:14 AM