Share News

టీడీపీలో చేరిక

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:55 AM

నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్‌ తగిలింది.

 టీడీపీలో చేరిక
టీడీపీలో చేరిన నాయకులతో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

నందికొట్కూరు మార్చి 28: నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్‌ తగిలింది. నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు రమేష్‌ యాదవ్‌, శంకర్‌ యాదవ్‌, సుధాకర్‌ యాదవ్‌, బాలకృష్ణ యాదవ్‌, మధు యాదవ్‌ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గురువారం నందికొట్కూరులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ వార్డు మెంబర్‌ యేసు రత్నం, ఇండిపెండెంట్‌ అభ్యర్థి అఖిల్‌, గ్రామానికి చెందిన ముఖ్య నాయకులతో పాటు ఎస్సీ, బీసీ, మైనార్టీలు, దాదాపు వంద కుటుంబాలు టీడీపీలో చేరాయి.

Updated Date - Mar 29 , 2024 | 12:55 AM