సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల తనిఖీ
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:19 AM
సార్వత్రిక ఎన్నికలు సమీ పిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ వెల్దుర్తి మండలంలో ఉన్న ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మిక పోలింగ్ కేంద్రా లను పరిశీలించారు.
పకడ్బందీగా విధులు నిర్వహించాలి
ఎస్పీ కృష్ణకాంత్
వెల్దుర్తి, ఏప్రిల్, 24: సార్వత్రిక ఎన్నికలు సమీ పిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ వెల్దుర్తి మండలంలో ఉన్న ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మిక పోలింగ్ కేంద్రా లను పరిశీలించారు. బుధవారం చెరుకు లపాడు, మల్లెపల్లె గ్రామాలలో పికెట్లు, పోలింగ్ కేంద్రా లను తనిఖీ చేశారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. గ్రామాలలో ప్రస్తుత మున్న పరిస్థితులు, స్థితిగతులను ఆరాతీశారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి ఆరా తీశారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ప్రశాంత వాతా వరణంలో ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ హెడ్కానిస్టేబుల్ ఖాజా, పోలీసులు పాల్గొన్నారు.