వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం: జయసూర్య
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:26 AM
వైసీపీ పాలనలో బీసీలకు, ముస్లింలకు అన్యాయం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య ఆరోపించారు.
మిడుతూరు, ఏప్రిల్ 17: వైసీపీ పాలనలో బీసీలకు, ముస్లింలకు అన్యాయం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య ఆరోపించారు. మండలంలోని కడుమూరు గ్రామంలో బుధవారం జయహో బీసీ సదస్సు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, సురేద్రనాథ రెడ్డి, ఇద్రుస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర లింగా రెడ్డి, గిత్తా జయసూర్య హాజరయ్యారు. జయసూర్య మాట్లాడుతూ టీడీపీ వస్తే మిడుతూరు మండలానికి ఎత్తి పోతుల వస్తుం దని హామీ ఇచ్చారు. మాండ్ర లింగారెడ్డి మాట్టాడుతూ బీజేపీ పొత్తు వల్లా ముస్లీం సోదరులకు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలియజేశారు. కడుమూరుకు చెందిన పుల్లన్న, గుడిపాడు గ్రామానికి చెందిన శ్రీను, మహేష్ టీడీపీలో చేరారు. జనసేన నాయకులు రవి కుమార్, సంపత్, టీడీపీ నాయకులు సర్వోత్తమ రెడ్డి, శివరామి రెడ్డి, సుధాకర్, రవీంద్రబాబు, సోపీసాహేబ్, ప్రసాద్ రెడ్డి, గిరీశ్వర్రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
నందికొట్కూరు: పట్టణంలోని సీఎస్ఐ పాలెంలో అయ్యరాజు, జయన్న, ఎర్రన్న, రవి ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావం నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య, మాండ్ర సురేంద్రనాథ్రెడ్డి, భాస్కర్రెడ్డి, వార్డు ఇన్చార్జిలు ముర్తుజావళి, జాకీర్ హుస్సేన్, రవీంద్ర, రవి పాల్గొన్నారు.
చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.