ప్రైవేట్ బస్సుకు భారీ జరిమానా
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:40 AM
పట్టణ సమీపంలోని జాతీయ రహ దారిపై ఆర్టీవో అధికారులు బుధవారం గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్కు వెళ్తున్న ప్రైవేటు బస్సును తనిఖీ చేశారు.
డోన్(రూరల్), ఏప్రిల్ 24: పట్టణ సమీపంలోని జాతీయ రహ దారిపై ఆర్టీవో అధికారులు బుధవారం గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్కు వెళ్తున్న ప్రైవేటు బస్సును తనిఖీ చేశారు. ఈ బస్సుకు ప్లేట్ నెంబరును మార్చి, రోడ్డు ట్యాక్స్లు, పర్మిట్లు లేకుండా తిరుగుతున్నట్లు గుర్తించామని డోన్ ఆర్టీవో క్రాంతి కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ బస్సు గుజరాత్ నెంబర్ప్లేట్తో రోడ్డుపై తిరుగుతుందని సీజ్ చేసి రూ.2,44,500 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.