Share News

గోసేవతో ముక్కోటి దేవతల అనుగ్రహం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:18 AM

గోసేవ చేసేవారిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుందని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు.

గోసేవతో ముక్కోటి దేవతల అనుగ్రహం

కర్నూలు(కల్చరల్‌), జనవరి 11: గోసేవ చేసేవారిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుందని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. గురువారం నగర శివారులో గుత్తిరోడ్డులోని శ్రీగాయత్రి గోశా లలో ఏర్పాటు చేసిన సహస్ర గో ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆయన ప్రారం భించారు. ఈకార్యక్ర మంలో యువ ప్రజా నాయకుడు టీజీ భరత్‌, ఆయ న తల్లి టీజీ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసా రిగా గాయత్రి గోశాలలో సహస్ర గో ప్రదక్షిణ ఏర్పాటు చేయడం అభినందనీ యమన్నారు. వారంలో ఒకసారైనా గో సేవ చేసేలా ప్రతి ఒక్కరూ ముందు కు రావాలని సూచించారు. గోశాలకు వచ్చిన వారు తమ కు తోచినంత సా యం చేయాలన్నారు. గోశాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:18 AM