Share News

చంద్రబాబుతోనే సుపరిపాలన

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:54 PM

రాష్ట్రంలో సుపరిపాలన చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

చంద్రబాబుతోనే సుపరిపాలన

బనగానపల్లె, ఏప్రిల్‌ 24: రాష్ట్రంలో సుపరిపాలన చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం బనగానపల్లె తహసీల్దారు కార్యాలయంలో బీసీ రెండో సెట్‌ టీడీపీ తరపున రిటర్నింగ్‌ అధికారి కామేశ్వర్‌రావుకు నామినేషన్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. అరాచక, అవినీతి వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సుపరిపాలన టీడీపీతోనే సాధ్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్రం బాగు పడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి టీడీపీతో సాధ్యమన్నారు. సీఎం జగన్‌ పోలవరం సర్వనాశనం చేసి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలు నిబంధనల పేరుతో జగన్‌ అన్యాయం చేశారని అన్నారు. విద్యుత్‌ చార్జీలు, డీజల్‌, పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరలు వైసీపీ పాలనలో ఆకాశాన్నంటాయన్నారు. వైసీపీ పాలనలో మైనింగ్‌ పరిశ్రమ సర్వనాశనం అయిందన్నారు. 40 వేల మంది కార్మికులకు గనుల్లో పనులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కుటుంబ సభ్యులు బీసీ రాజారెడ్డి, మనోరమ, పట్టణ ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:54 PM