Share News

వైభవంగా స్వాతి వేడుకలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:53 AM

అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను వేదపండితులు గురువారం నిర్వహించారు.

వైభవంగా స్వాతి వేడుకలు

నంద్యాల, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను వేదపండితులు గురువారం నిర్వహించారు. ముందుగా ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను విశేషంగా అలంకరించి, పూజలు చేశారు. అనంతరం 108 కలశాలతో సుదర్శన హోమం చేపట్టారు. స్వాతి వేడుకలను పురస్క రించుకొని భక్తులు నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని పూజలు చేసి సుదర్శన హోమంలో పాల్గొన్నారు. భక్తులకు వేదపండితులు తీర్థప్ర సాదాలు అందించారు

పీఠాధిపతి పూజలు : అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ మఠంలోని మాలోల నరసింహస్వామికి, స్వర్ణ నరసింహ స్వామికి స్వాతిని పురస్కరించుకొని పూజలు చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు వేదపండితులు తీర్థప్రసాదాలు అందించారు.

Updated Date - Mar 29 , 2024 | 12:53 AM