ఒక్క అవకాశం ఇవ్వండి
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:36 AM
ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ కోరారు. బుధవారం నగరంలోని 24వ వార్డు లక్ష్మినగర్, మద్దూర్ నగర్లలో టీజీ భరత్ భరోసాయాత్ర నిర్వహించారు.
కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్
కర్నూలు(అర్బన్), ఏప్రిల్ 17: ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ కోరారు. బుధవారం నగరంలోని 24వ వార్డు లక్ష్మినగర్, మద్దూర్ నగర్లలో టీజీ భరత్ భరోసాయాత్ర నిర్వహించారు. కర్నూలును అభివృద్ధి చెసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనను గెలిపిస్తే ప్రజలందరికీ మేలు చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాల నలో కర్నూలులో ఎక్కడ చూసినా సమస్యలనే కనిపిస్తున్నాయని మండి పడ్డారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, తాగునీరు సమ యానికి రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
టీజీ భరత్కు ఘన స్వాగతం .. టీజీ భరత్ భరోసా యాత్ర పేరుతో లక్ష్మీనగర్లో పర్యటించిన ఆయన ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవణమ్మ, సీనియర్ నాయకులు స్వామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బషిర్, జనసేన ఇన్చార్జి హర్షద్, టీడీపీ నాయకులు లక్ష్మణ్రావు, ఆర్జా రామక్రిష్ణ, పర్వినీసా, ఉపేంద్ర, విశ్వనాత్, సునీల్, ఎలప్ప, గుణ, షేక్షా, భాను, జ్యోతి, పవన్, టీడీపీ సీనియర్ నాయకులు, బూత్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.