Share News

ప్రధాన న్యాయాధికారిగా జి.ప్రతిభాదేవి ఇన్‌చార్జి బాధ్యతలు

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:50 PM

కర్నూలు జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారిగా కర్నూలు నాల్గవ అదనపు జిల్లా న్యాయాధికారి జి.ప్రతిభాదేవిని నియమిస్తూ బుధవారం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రధాన న్యాయాధికారిగా జి.ప్రతిభాదేవి ఇన్‌చార్జి బాధ్యతలు

కర్నూలు(లీగల్‌), జూలై 31: కర్నూలు జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారిగా కర్నూలు నాల్గవ అదనపు జిల్లా న్యాయాధికారి జి.ప్రతిభాదేవిని నియమిస్తూ బుధవారం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయాధికారిగా ఉన్న ఎన్‌.శ్రీనివాసరావు బుధవారం పదవీవిరమణ చేశారు. దీంతో జి.ప్రతిభాదేవికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

Updated Date - Jul 31 , 2024 | 11:50 PM