Share News

శ్రీశైలంలో ఉచిత బస్సు సేవలు

ABN , Publish Date - Nov 23 , 2024 | 12:26 AM

శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం శుక్రవారం ఉచిత బస్సును ప్రారంభించింది.

శ్రీశైలంలో ఉచిత బస్సు సేవలు
ఉచిత బస్సును ప్రారంభిస్తున్న ఆలయ అధికారులు

లాంఛనంగా ప్రారంభించిన అధికారులు

శ్రీశైలం, నవంబరు 22(ఆంధ్రజోతి): శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం శుక్రవారం ఉచిత బస్సును ప్రారంభించింది. పర్వదినాలు, వారాంతపు సెలవురోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారు. భక్తులు శ్రీశైల క్షేత్రంలో ప్రయాణించేందుకు వీలుగా ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సును అందుబాటులో ఉంచారు. ఈ బస్సు గణేశ సదనం, అన్నప్రసాద భవనం మీదుగా క్యూ కాంప్లెక్సు వరకు ప్రయాణిస్తుంది. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు ఎం.నరసింహారెడ్డి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:26 AM