న్యాయం కోసం..
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:28 AM
కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జూనియర్ డాక్టర్లు మంగళవారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
జూనియర్ డాక్టర్ల బైక్ ర్యాలీ
కర్నూలు(హాస్పిటల్), ఆగస్టు 20: కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జూనియర్ డాక్టర్లు మంగళవారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓల్డ్ సీఎల్జీ అనంతరం కలెక్టరేట్ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు అనంతరం కలెక్టరేట్, సీ క్యాంపు మీదుగా నంద్యాల చెక్పోస్టు నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అచ్యుత్ మాట్లాడుతూ వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కోల్కతా ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.