బుగ్గన చెప్పేవన్ని గాలిమాటలే
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:49 PM
డోన్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పేవన్ని గాలి మాటలేనని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
డోన్, ఏప్రిల్ 26: డోన్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పేవన్ని గాలి మాటలేనని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపురం, తాడూరు గ్రామాల్లో కూతురు కోట్ల నివేదితతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మాపురం గ్రామంలో పలువురు మహిళలు తాగునీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నామని కోట్ల సుజాతమ్మ దృష్టికి తీసుకువచ్చారు. కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ మంత్రి బుగ్గన అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నాడని, గ్రామాల్లో కనీసం ప్రజలకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి కనిపిం చడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, జిల్లా అధికార ప్రతినిధి విజయభట్టు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, కమలా పురం సర్పంచ్ రేగటి అర్జున్రెడ్డి, రేగటి రామ్మోహన్రెడ్డి, భాస్కర్ నాయు డు, ధర్మవరం భరత్రెడ్డి, రంజిత్ కిరణ్, తాడూరు వెంకట రమణయ్య, మిద్దెపల్లి గోవిందు తదితరులు పాల్గొన్నారు.