Share News

‘సమ సమాజ స్థాపనకు కృషి’

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:04 AM

సమ సమాజ స్థాపనకు సమాజ్‌వాది పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాయలసీమ జిల్లాల కో ఆర్డినేటర్‌ పాండురంగయాదవ్‌ అన్నారు.

‘సమ సమాజ స్థాపనకు కృషి’
మాట్లాడుతున్న పాండురంగ యాదవ్‌

నంద్యాల (నూనెపల్లె), జనవరి 31: సమ సమాజ స్థాపనకు సమాజ్‌వాది పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాయలసీమ జిల్లాల కో ఆర్డినేటర్‌ పాండురంగయాదవ్‌ అన్నారు. నంద్యాలలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ యాదవ్‌ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పాండురంగయాదవ్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నంద్యాల జిల్లా అంతటా అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ కలుపుకొని పోతామన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ త్వరలో రాష్ట్ర పర్యటన జరగనున్న నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మధు, రాజేష్‌, హనుమంతుకుమార్‌ నాయుడు, అనిల్‌ కుమార్‌, నరసయ్య, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:04 AM