ప్రాంతీయ పార్టీల శకం ముగిసింది: బీజేపీ
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:03 AM
ప్రాంతీయ పార్టీల శకం ముగి సిందని, వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీలదే హవా అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రజాపోరు కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
![ప్రాంతీయ పార్టీల శకం ముగిసింది: బీజేపీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు(ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 16: ప్రాంతీయ పార్టీల శకం ముగి సిందని, వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీలదే హవా అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రజాపోరు కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్లో ప్రైమ్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల ఆస్తులకు హక్కు లు ఉన్నట్లు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. బీజేపీలో ఇలాంటి నీచ రాజకీయాలు లేవన్నారు. ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీలాగా అధికార, ప్రతి పక్ష పార్టీలు అనుకుంటున్నాయని, అలాంట ప్పుడు పొత్తుల కోసం ఎందుకు ఆరాటపడుతున్నాయని అన్నారు. ఈ నెల 21న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన ప్రజాపోరు యాత్రను జాతీయ నాయకులతో ప్రారంభిస్తారన్నారు. ఈకార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు హాజరవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీల కంఠ, సీనియర్ నాయకులు పోలంకి రామస్వామి, రాఘవేంద్ర, సందడి సుధాకర్, కాశీవిశ్వనాథ్, ప్రకాష్ పాల్గొన్నారు.