ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Apr 05 , 2024 | 01:26 AM
న్నికల నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు.
![ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్](https://media.andhrajyothy.com/media/2024/20240326/4_Alg_Photo_1f_537ebb4154.gif)
నంద్యాల, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆర్వో, ఏఆర్వోల టీంలైన ఎఫ్ఎస్టీ, వివిటి, ఎంసీసీ, ఆడిట్ టీంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ బృందాలన్నీ సంబంధిత రికార్డులను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లికార్జునరెడ్డి, ఏఆర్వో నజీర్ అహమ్మద్, డీఎస్పీ షర్ఫుద్దీన్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.