టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి: బుడ్డా
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:53 AM
టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కోరారు.
వెలుగోడు, మార్చి 28: టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కోరారు. గురువారం వేల్పనూరులోని స్వగ్రామంలో వెలుగోడు గండిపేటకు చెందిన చిన్న ఆంజనేయులు ఆధ్వ ర్యంలో చిన్న ఎల్లయ్య, కేశాలు రవికుమార్, భాస్కర్, మస్తాన్తో పాటు మరో 30 కుటుంబాలు వైపీపీని వీడి టీడీపీ చేరాయి. వారికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. గురువారం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సమక్షంలో వేల్పనూరులో సిద్ధపల్లె గ్రామ వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. సిద్దపల్లె గ్రామానికి చెందిన కుమ్మరి ఈశ్వరయ్య, లింగారెడ్డి, కాకుల శేఖర్,రమణయ్య, వెంకటకృష్ణారెడ్డి, శివారెడ్డి, కుమారి, రమేష్ తదితరులతో పాటు మరో 10 కుటుంబాలు వైసీపీ వీడి టీడీపీలో చేరాయి.