టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి
ABN , Publish Date - Apr 17 , 2024 | 12:32 AM
టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి అఖిలప్రియ కోరారు.
![టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మాజీ మంత్రి అఖిలప్రియ
నంద్యాల, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి అఖిలప్రియ కోరారు. మాజీ మంత్రి అఖిలప్రియ కోరారు. ఆళ్లగడ్డ మండలంలోని ఓబుళంపల్లె గ్రామ విద్యాకమిటీ చైర్మన్ లాలుసా గారి రంజిత్ బాషా గ్రామ టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి ఆధ్వరంలో ఆళ్లగడ్డలోని మాజీ మంత్రి అఖిలప్రియ స్వగృహంలో మంగళవారం టీడీపీలో చేరారు. ఆయనతో పాటు మరో పది కుటుంబాలు చేరాయి. టీడీపీ నాయకుడు భూమా విఖ్యాత్రెడ్డి తదితరులు ఉన్నారు.
శిరివెళ్ల: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, ఆళ్లగడ్డ నియోజకవర్గ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. మండలంలోని గోవిందపల్లె గ్రామంలో మంగళవారం పర్యటించి టీడీపీ మినీ మేనిఫె స్టోలోని సూపర్-6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. గ్రామంలో 40 కుటుంబాలు భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరారు. అనం తరం ఆమె మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభి స్తున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని అన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు గంగదాసరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీరెడ్డి, రవి చంద్రారెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వర్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.