తాగునీటి కష్టాలను పరిష్కరిస్తా: టీజీ భరత్
ABN , Publish Date - Apr 07 , 2024 | 12:30 AM
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను పరిష్కరిస్తానని కర్నూలు టీడీపీ అభ్యర్ధి టీజీ భరత్ హామీనిచ్చారు.
![తాగునీటి కష్టాలను పరిష్కరిస్తా: టీజీ భరత్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు(అర్బన్), ఏప్రిల్ 6: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను పరిష్కరిస్తానని కర్నూలు టీడీపీ అభ్యర్ధి టీజీ భరత్ హామీనిచ్చారు. శనివారం నగరంలోని 42వ వార్డు పరిధి తిలక్నగర్లో వైసీపీ నాయకులు మహేష్, విజయ్, శ్రీనివాసులు తదితరులు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి టీజీ భరత్తోపాటు ఎంపీ అభ్యర్ధి బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులోని అన్ని వార్డుల్లో టీడీపీ పూర్తి స్థాయిలో బలోపేతమైందన్నారు. జగన్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి పని చేసి 99 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఆరోపించారు. సరైన ప్రభుత్వం, సరైన నాయకులు ఉంటేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని భరత్ హామీనిచ్చారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వలీ, తిమ్మారెడ్డి, హరి, మధు యాదవ్, ఫయాజ్ , శ్రీను, తెలుగు నరసింహులు, జనసేన ఇంచార్జీ అర్షద్, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, బీజేపీ నాయకులు సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.