Share News

డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ పి.శాంతికళ

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:44 PM

ర్నూలు జిల్లా వైద్యఆ రోగ్య శాఖాధికారిగా డాక్టర్‌ పి.శాంతికళ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఆమె డాక్టర్‌ ఎల్‌.భాస్కర్‌ నుంచి బాధ్యతలను స్వీకరించారు.

డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ పి.శాంతికళ
డాక్టర్‌ భాస్కర్‌ నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ శాంతికళ

కర్నూలు హాస్పిటల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా వైద్యఆ రోగ్య శాఖాధికారిగా డాక్టర్‌ పి.శాంతికళ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఆమె డాక్టర్‌ ఎల్‌.భాస్కర్‌ నుంచి బాధ్యతలను స్వీకరించారు. కడప జిల్లా జమ్మల మడుగులో డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పని చేస్తున్న డాక్టర్‌ పి.శాంతికళ సివిల్‌ సర్జన్‌గా పదోన్నతి పొంది కర్నూలు డీఎంహెచ్‌వోగా వచ్చారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న అసంక్రమిత వ్యాధుల సర్వే ఎన్‌సీడీ 3.0 వేగవంతం చేయాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి వందశాతం ఉండేటట్లు అధికారులు, సిబ్బంది పని చేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:44 PM