Share News

మసీదులను రాజకీయ వేదికలుగా మార్చొద్దు

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:44 AM

నగరంలోని కొందరు రాజకీయ నాయకులు మసీదులను రాజకీయ వేదికలుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరరత్‌ అన్నారు.

మసీదులను రాజకీయ వేదికలుగా మార్చొద్దు

కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరరత్‌

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

కర్నూలు(అర్బన్‌), మార్చి 10: నగరంలోని కొందరు రాజకీయ నాయకులు మసీదులను రాజకీయ వేదికలుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరరత్‌ అన్నారు. ఆదివారం నగరంలోని మౌర్యఇన్‌లో 5వ వార్డుకు చెందిన వైసీపీ నాయకుడు భేగ్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో కీలక వ్యక్తిగా ఉంటున్న ఈయన తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీజీ భరత్‌ మాట్లాడుతూ బేగ్‌ రాకతో ఆ ప్రాంతంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందన్నారు. పార్టీలో చేరిన వారంతా రానున్న 40 రోజులు కష్టపడాలని సూచించారు. కర్నూలులో ఫ్యాక్టరీలు తీసుకొచ్చి యువతకు మంచి భవిష్యత్‌ అందిస్తామన్నారు. ఇక రంజాన్‌ మాసాన్ని ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఇదే సమయంలో పలువురు స్వార్థ పరులు మసీదుల్లో రాజకీయాలు చేసే అవకాశం ఉందని, అప్పమత్తంగా ఉండాలని సూ చించారు. కార్యక్రమంలో జనసేన కర్నూలు ఇన్‌చార్జి అర్హద్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 06:50 AM