Share News

దేవస్థానానికి విరాళాలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:30 AM

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి పశ్చిమగోదావరి, భీమవరానికి చెందిన ఎ.రామకృష్ణ రూ.లక్ష విరాళాన్ని, ఖమ్మం జిల్లాకు చెందిన వీవీఎస్‌ఎస్‌ శివరామకృష్ణ రూ.లక్ష విరాళాన్ని, రంగారెడ్డి జిల్లాకు చెందిన మారేడుపల్లి నందీశ్వరరెడ్డి రూ.1,11,116 విరాళాన్ని అధికారులకు అందజేశారు.

దేవస్థానానికి విరాళాలు

శ్రీశైలం, జనవరి 29: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి పశ్చిమగోదావరి, భీమవరానికి చెందిన ఎ.రామకృష్ణ రూ.లక్ష విరాళాన్ని, ఖమ్మం జిల్లాకు చెందిన వీవీఎస్‌ఎస్‌ శివరామకృష్ణ రూ.లక్ష విరాళాన్ని, రంగారెడ్డి జిల్లాకు చెందిన మారేడుపల్లి నందీశ్వరరెడ్డి రూ.1,11,116 విరాళాన్ని అధికారులకు అందజేశారు. అలాగే గో సంరక్షణ నిథికి సికింద్రాబాద్‌ రాణి కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు చెందిన గల్లా గుండయ్య రూ.5 లక్షలు, చెన్నైకి చెందిన ఎల్‌. రమేష్‌రెడ్డి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.

శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు సికింద్రాబాద్‌ రాణి కన్‌స్ట్ర్ట్రక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు చెందిన గల్లా గుండయ్య వైద్యశాలకు బయోకెమిస్ట్రీ అనలైజర్‌ మిషన్‌, వివిధ రకాల ఔషధాలను విరాళంగా అందించారు. వీటి విలువ సుమారు రూ.1,63,412 ఉంటుందని దాత తెలిపారు. దాత ఈ విరాళాన్ని దేవస్థానం వసతి విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్‌వీ మోహన్‌కు అందజేశారు. వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:30 AM