Share News

శాశ్వత అన్నదాన పథకానికి విరాళం

ABN , Publish Date - May 17 , 2024 | 12:13 AM

శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్నదాన పథకానికి గురువారం హైదరాబాద్‌కు చెందిన వీకే అశ్విన్‌ అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. 1,01,116 విరాళంగా అందజేశారు.

శాశ్వత అన్నదాన పథకానికి విరాళం
భక్తులకు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేస్తున్న పర్యవేక్షకురాలు

శ్రీశైలం, మే 16: శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్నదాన పథకానికి గురువారం హైదరాబాద్‌కు చెందిన వీకే అశ్విన్‌ అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. 1,01,116 విరాళంగా అందజేశారు. దాత ఈ విరాళాన్ని దేవస్థానం పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు. అలాగే వికారాబాద్‌కు చెందిన అరుణ మనోహర్‌రెడ్డి అనే భక్తుడు రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకుడు గంజి రవికి అందజేశారు. దేవస్థానం అధికారులు దాతకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

Updated Date - May 17 , 2024 | 12:13 AM