నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN , Publish Date - Mar 27 , 2024 | 12:12 AM
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్న ప్రసాద వితరణ పథకానికి మంగళవారం కర్నూలుకు చెందిన పత్తికొండ విజయలక్ష్మీ అనే భక్తురాలు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు.
![నిత్యాన్నదాన పథకానికి విరాళం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శ్రీశైలం, మార్చి 26: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్న ప్రసాద వితరణ పథకానికి మంగళవారం కర్నూలుకు చెందిన పత్తికొండ విజయలక్ష్మీ అనే భక్తురాలు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన జేఎస్ఎస్పీ శర్మ అనే భక్తుడు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు మధుసుదన్రెడ్డికి అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, స్వామి, అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.