Share News

గో సంరక్షణ నిధికి విరాళం

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:03 AM

శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిథి పథకానికి సోమవారం నెల్లూరుకు చెందిన సి.భువనేశ్వర రెడ్డి అనే భక్తుడు రూ. 1,50,000 విరాళంగా అందజేశారు.

గో సంరక్షణ నిధికి విరాళం

శ్రీశైలం, జూన్‌ 10: శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిథి పథకానికి సోమవారం నెల్లూరుకు చెందిన సి.భువనేశ్వర రెడ్డి అనే భక్తుడు రూ. 1,50,000 విరాళంగా అందజేశారు. భక్తుడు ఈ విరాళాన్ని దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఫణిధర్‌ ప్రసాద్‌కు అందజేశారు. దేవస్థానం అధికారులు దాతకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

Updated Date - Jun 11 , 2024 | 12:03 AM