Share News

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: గౌరు చరిత

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:55 AM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీడీపీ పాణ్యం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: గౌరు చరిత
క్లస్టర్‌, బూత్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలకు ప్రచార సామగ్రి అందిస్తున్న గౌరు చరిత, మల్లెల రాజశేఖర్‌

కల్లూరు, ఫిబ్రవరి 28: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీడీపీ పాణ్యం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. బుధవారం స్థానిక మాధవీన గర్‌లోని తన స్వగృహంలో పాణ్యం నియోజకవర్గం విస్తృతస్థాయి సమావే శం, శంఖారావం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, కల్లూరు అర్బన్‌ వార్డుల కన్వీనర్‌ పెరుగు పురుషోత్తంరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు చంద్రబాబు సూపర్‌సిక్స్‌ పథకాలు ప్రవేశపెట్టా రన్నారు. ఎన్నికలకు కేవలం 45 రోజులు మాత్రమే ఉందని టీడీపీ, జనసేన కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలు పునిచ్చారు. అనంతరం క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జ్‌లకు ఎన్నికలకు సమాయత్తం చేస్తూ గౌరు చరిత దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో టీడీపీ అయా మండలాల అధ్యక్షులు డి.రామాంజనేయులు, డి. గోవిందరెడ్డి, డి.సత్యనారాయ ణరెడ్డి, జి.జయరామిరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ఎన్వీ. రామకృష్ణ, వాకిటి మాదేష్‌, ఉలిందకొండ టీడీపీ నాయకులు ఈవీ రమణ, జిలాని, మస్తాన్‌నాయుడు, విజయ్‌, రమణారెడ్డి పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక: కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామంలో వైసీపీకి 30 కుటుంబాలు టీడీపీ పాణ్యం అభ్యర్థి గౌరుచరిత సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం పుసులూరు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో దొడ్డిపాడు వైసీపీకి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌, ఉస్మాన్‌బాషాతోపాటు పలువురు టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో నజీర్‌భాషా, జిలానీ బాషా, నూర్‌బాషా, సిలార్‌బాషా, ఎస్‌.ఖాసీం, బందేనవాజ్‌, మిన్నల్ల, నబీ రసూల్‌, ఆటోశేక్షా, దస్త గిరి, మాసూవలి ఉన్నారు. కార్యక్రమంలో సాయి తరుణ్‌, మాహబూబ్‌బాషా, ఖాజాహుసేన్‌, సయ్యద్‌ ఖాసీం పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:55 AM