జిల్లాకు చేరుకున్న సీఎం జగన్
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:44 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాత్రి 10 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకున్నారు.
చాగలమర్రి, మార్చి 27: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాత్రి 10 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ‘మేము సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ఆళ్లగడ్డలోని శిల్పా టౌన్షిప్లో ఆయన బస చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి చాగలమర్రి టోల్ ప్లాజా వద్ద మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, ఏపీ జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సులోనే ఉంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. నంద్యాలలో గురువారం సీఎం జగన్ రోడ్షో కార్యక్రమాలను నిర్వహించనున్నారు.