Share News

స్కానింగ్‌ కేంద్రంలో తనిఖీ

ABN , Publish Date - May 29 , 2024 | 12:15 AM

నగరంలోని గాయత్రీ ఎస్టేట్‌లోని అమృత హాస్పిటల్‌ స్కానింగ్‌ కేంద్రాన్ని డీఎంహెచ్‌వో వై.ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు.

స్కానింగ్‌ కేంద్రంలో తనిఖీ

కర్నూలు(హాస్పిటల్‌), మే 28: నగరంలోని గాయత్రీ ఎస్టేట్‌లోని అమృత హాస్పిటల్‌ స్కానింగ్‌ కేంద్రాన్ని డీఎంహెచ్‌వో వై.ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ స్కానింగ్‌ కేంద్రంలో క్రమం తప్పకుండా ఫారం-ఎఫ్‌, పీసీపీఎన్‌డీటీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రైవేటు హాస్పిటల్‌లో జరిగే కాన్పు వివరాలను డెలివరి రిజిస్టర్‌లో సురక్షిత గర్భస్రావాలు, ఎంటీపీ, రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఆసుపత్రిలో నిర్వహించే కాన్పును సాధారణ డెలివరిగా చేయా లని, అలా కాకపోతే సిజేరియన్‌ చేయాలని అన్నారు. ఆయన వెంట డెమో ప్రమీలాదేవి, డిప్యూటీ డెమో చంద్రశేఖర్‌ రెడ్డి, పీసీపీఎన్‌డీటీ మానిటరింగ్‌ కన్సల్టెంట్‌ సుమలత ఉన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:15 AM