చాపిరేవుల చెక్పోస్టు తనిఖీ
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:19 AM
నంద్యాల మండలం చాపిరేవుల గ్రామం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళవారం ఎస్పీ కె.రఘువీర్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
![చాపిరేవుల చెక్పోస్టు తనిఖీ](https://media.andhrajyothy.com/media/2024/20240227/27_NDL_CRIME_6f_2315dcf5db.gif)
నంద్యాల క్రైం, ఫిబ్రవరి 27: నంద్యాల మండలం చాపిరేవుల గ్రామం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళవారం ఎస్పీ కె.రఘువీర్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ విధినిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువులు అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. ఇందుకుగాను ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. స్పెషల్బ్రాంచ్ డీఎస్పీ జేవీ సంతోష్ ఉన్నారు.