19న ఆలూరుకు చంద్రబాబు రాక
ABN , Publish Date - Apr 16 , 2024 | 11:58 PM
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19వ తేదీ శుక్రవారం ఆలూరుకు రానున్నారు.
![19న ఆలూరుకు చంద్రబాబు రాక](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19వ తేదీ శుక్రవారం ఆలూరుకు రానున్నారు. చంద్రబాబు పర్యటన దిగ్విజయం చేసేందుకు ఆలూరు టీడీపీ అభ్యర్థి బి.వీరభద్ర గౌడ్ సహా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాగళం యాత్ర తొలి విడత ప్రచారం ఉమ్మడి జిల్లాలో ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డలో నిర్వహించారు. రెండో విడత జిల్లాలో ఆలూరులో 19న సాయంత్రం 3 గంటలకు జరిగే జంక్షన్ సభలో చంద్రబాబు పాల్గొంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, అభ్యర్థి వీరభద్రగౌడ్ తెలిపారు. ఆలూరు సభ అనంతరం చంద్రబాబు అనంతపురం జిల్లా రాయదుర్గం సభకు హాజరవుతారు.