29న డోన్కు చంద్రబాబు
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:23 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 29న డోన్ వస్తున్నారు.
డోన్, ఏప్రిల్ 26: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 29న డోన్ వస్తున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పట్టణంలో కోట్ల తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, టీడీపీ లీగల్ సెల్ సీనియర్ న్యాయవాది శ్రీనివాసభట్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున తదితరులు పరిశీలించారు. వెంకటనాయునిపల్లి రోడ్డులో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా పాతబస్టాండులో గాంధీ విగ్రహం ముందు జరిగే సభ కూడలిని పరిశీలించారు.
చంద్రబాబు పర్యటన ఇలా
ఈ నెల 29న సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబు డోన్కు చేరుకుంటారు. వెంకటనాయునిపల్లె రోడ్డులోని హెలిప్యాడ్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి రోడ్షో నిర్వహిస్తారు. పాతబస్టాండులో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.