Share News

టీడీపీ శ్రేణుల సంబరాలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:35 AM

రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం సృష్టించడంతో మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ సంబరాలు అంబరాన్నంటాయి.

టీడీపీ శ్రేణుల సంబరాలు
చాగలమర్రి టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల సంబరాలు

డోన్‌(రూరల్‌), జూన్‌ 4: రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం సృష్టించడంతో మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ సంబరాలు అంబరాన్నంటాయి. డోన్‌లో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి వైసీపీపై విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యక ర్తల బాణసంచాలు పేలుస్తూ స్వీట్లను పంపిణీ చేసుకున్నారు. అనంతరం డోన్‌ టీడీపీ కార్యాలయానికి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని సంబరాలు చేసుకున్నారు.

కోవెలకుంట్ల: టీడీపీ ప్రభంజనానికి రాష్ట్రంలో వైసీపీ కొట్టుకుపోయి చివరకు ప్రతిపక్ష హోదా లేకుండా పది సీట్లకే పరిమితమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకృష్ణారెడ్డి, కోవెలకుంట్ల మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ గడ్డం నాగేశ్వరరెడ్డిలు అన్నారు. మంగళవారం కోవెలకుంట్ల పట్టణంలోని గడ్డం రామకృ ష్ణారెడ్డి ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలతో కలసి సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా గడ్డం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీ జనార్దన్‌రెడ్డి భారీ మెజా ర్టీతో గెలుపొందడం ఇది ప్రజా విజయమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూట మి గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్యాపిలి: సార్వత్రిక ఎన్నికల్లో డోన్‌ కూటమి అభ్యర్థి కోట్ల ప్రకాష్‌రెడ్డి గెలుపొందడంతో మం గళవారం పట్టణంలో కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి బాణ సంచా పేల్చారు. అనంతరం హనుమాన్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు.

శిరివెళ్ల: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలోని టీడీపీ భారీ మెజార్టీతో గెలు పొందడం, ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ విజయం సాధిం చడంతో టీడీపీ శ్రేణులు మంగళవారం సంతోషం వ్యక్తం చేశారు. శిరివెళ్లలో మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, ఎంపీటీసీ యామా శ్రీనివాసులు నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు.

చాగలమర్రి: చాగలమర్రి మండలంలో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖి లప్రియ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి మంగళవారం ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్‌ ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా, జనసేన నాయకులు, కార్య కర్తలు ఉన్నారు. న్యూబిల్డింగ్స్‌ వీధిలో టీడీపీ నాయకుడు జెట్టి నాగరాజు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు.

ఉయ్యాలవాడ: ఉయ్యాలవాడలో చంద్రబాబు, పవణ్‌ కళ్యాణ్‌ ఫొటోలకు క్షీరాభిషేకం చేసి కేక్‌ కట్‌ చేశారు. ఒకరికొకకరు కరచాలనం చేసుకొని శుభా కాంక్షలు తెలిపారు. ఉయ్యాలవాడలో బలిజసంఘం నాయకులు శ్రీకృష్ణదేవ రాయలు చిత్రపటానికి పూలమాల వేశారు.

ఆళ్లగడ్డ: సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ గెలుపొందడంతో ఆళ్లగడ్డ పట్టణంలోని ఆమె ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

రుద్రవరం: ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ విజయం సాధించడంతో డి.కొట్టాలు గ్రామంలో నాయకుడు కృష్ణారెడ్డి కేక్‌ కట్‌ చేశారు. ఆలమూరు, రుద్రవరం, రెడ్డిపల్లె, టి.లింగందిన్నె ఇంకా పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

దొర్నిపాడు: సార్వత్రిక ఎన్నికల ఓటింగ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయకేతనం ఎగురవేసిందని టీడీపీ మండల నాయకులు మల్లేశ్వర చౌదరి, లింగుట్ల వెంకట్‌నాయుడు, కొత్తపల్లి సురేంద్ర, బబ్బూరి వెంకటస్వామి, చక్రవర్తి నాయుడు, సిద్ధి సత్యంలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం చాకరాజువేములలో లింగుట్ల వెంకట్‌నాయుడు ఇంటి ఆవరణలో కేక్‌ కట్‌ చేశారు.

అవుకు: బనగానపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి 25,566 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో అవుకు మండలంలోని నాయకులు, కార్యకర్తలు మంగళవారం సంబరాలు చేసుకున్నారు. గ్రామాల్లో టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు టీడీపీ కార్యకర్తలు చేరుకొని ఆనందాన్ని పం చుకు న్నారు. టీడీపీ నాయకులు గూడాల ప్రభాకరెడ్డి, మురళీధర్‌రెడ్డి, కునుకుంట్ల గ్రా మ సర్పంచ్‌ రామకృష్ణారెడ్డి, నాగేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్‌ పాల్గొన్నారు.

సంజామల: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీని ప్రజలు భూస్థాపితం చేశారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, కోవెలకుంట్ల మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ పెండేకంటి కిరణ్‌కుమార్‌ అన్నారు. బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 05 , 2024 | 12:36 AM