Share News

టీడీపీ శ్రేణుల సంబరాలు

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:57 AM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించడంతో నాయకులు సంబరాలు జరుపుకున్నారు.

టీడీపీ శ్రేణుల సంబరాలు
టీజీ భరత్‌ను అభినందిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు

బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ

కల్లూరు, ఫిబ్రవరి 24: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించడంతో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. శనివారం గౌరు నివాసం నుంచి కల్లూరు అర్బన్‌ కన్వీనర్‌ పెరుగు పురు షోత్తంరెడ్డి ఆధ్వర్యంలో అమ్మా హాస్పిటల్‌ సర్కిల్లో బాణసంచా కాల్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, డి.రామాంజనేయులు మాట్లాడుతూ పాణ్యం కోటపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తిరుమలేశ్వరరెడ్డి, పెద్దబీచుపల్లి, పల్లె రఘునాథ్‌రెడ్డి, పీయూ మాదన్న, శేఖ ర్‌చౌదరి, వంగాల జనార్దన్‌రెడ్డి, డివి.చంద్ర, లక్ష్మణ్‌, సురేందర్‌రెడ్డి, పవన్‌ కుమార్‌, వీరేంద్ర, జగదీష్‌రెడ్డి, చిన్నమారెన్న, ప్రభాక ర్‌రెడ్డి, పీవీ రమణారెడ్డి, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓర్వకల్లు: టీడీపీ పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి జాబితాలో గౌరు చరి తారెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో శనివారం ఓర్వకల్లులో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నంద్యాల ఉపాధ్యక్షుడు మోహన్‌ రెడ్డి, నాయకులు, లక్ష్మీకాంతరెడ్డి, అబ్దుల్లా, అల్లాబాబు, వేణుగోపాల్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి, ఏసేపు, నారాయణ రెడ్డి, నాగరాజు, శ్రీరాములు, అయూ బ్‌బాషా, యాసిన్‌బాషా పాల్గొన్నారు.

కర్నూలు(అర్బన్‌): టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి టీజీ భరత్‌ పేరును ప్రకటించడంపై కర్నూలు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం మౌర్యఇన్‌ వద్ద ఆయన ఆనుచరులు, అభిమానులు కేక్‌ కట్‌ చేసి, టపా సులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం టీడీపీ, జనసేన పార్టీ నేతలు టీజీ భరత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీజీ భరత్‌ పార్టీ అధి నేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు, కార్యకర్తలు జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

టీడీపీ జెండా ఎగరవేస్తాం: విష్ణువర్దన్‌రెడ్డి

కర్నూలు(రూరల్‌): కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తామని టీడీపీ సీనియర్‌ నేత ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం టీడీపీ ఆధినేత చంద్రబాబు కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరిని ప్రకటించడంతో విష్ణు నివాసం వద్ద ఆయన వర్గీయులు బాణా సంచా కాల్చారు. విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు బొగ్గుల దస్తగి రికి గజమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ కోడుమూరులో బొగ్గుల దస్తగిరిని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని అన్నారు. కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత నారా లోకేశ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడులకు బొగ్గుల దస్తగిరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి నగర శివారు జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల నుంచీ పసుపుల గ్రామం వరకు యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించి, భారీ ఊరేగింపు చేశారు.

గూడూరు: కోడుమూరు టీడీపీ టికెట్‌ బొగ్గుల దస్తగిరికి రావడం పట్ల టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. మాజీ నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ కురుకుంద రామాంజనేయులు ఆధ్వర్యంలో విష్ణు సేన అభిమానులు బాణా సంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు, టీడీపీ కౌన్సిలర్లు బుడ్డంగలి, కోడుమూరు షాషావలి, బోజుగు దానమన్న, పౌలు, చాంద్‌ బాషా, విజయ్‌ కుమార్‌, విష్ణుసేన పాల్గొన్నారు.

కోడుమూరు(రూరల్‌): అభ్యర్థుల జాబితాలో కోడుమూరు నుంచి బొగ్గుల దస్తగిరికి టికెట్‌ ఖరారు కావడంతో వర్కూరు గ్రామంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపారు. స్థానిక ఆటో స్టాండ్‌, న్యూఎస్సీ కాలనీల్లో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అశోక్‌, చెన్నరా యుడు, జే రాముడు, జీపు క్రిష్ణ, గడ్డమయ్య, రామాంజనేయులు, నాగరాజు, పుల్లన్న, ఇసాక్‌, క్రిష్ణ పాల్గొన్నారు.

సి.బెళగల్‌: టీడీపీ కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరిని శనివారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించడంతో మండలంలోని టీడీపీ శేణుల్రు బాణాలు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. టీడీసీ సీనియర్‌ నాయకుడు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి కలిసి బొగ్గుల దస్తగిరి కలిసి పూల బొకే అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజు, ముని, ధనుంజయుడు, విష్ణు హమాలీ యూనియన్‌ నాయకుడు భీమన్న, పోల కల్లు అమర్‌, దాసు, ఎంపీటీసీ, సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:57 AM