కాటసానికి బుద్ధి చెప్పండి : మాజీ ఎమ్మెల్యే బీసీ
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:36 PM
ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి పిలుపునిచ్చారు.
బనగానపల్లె రూరల్, ఏప్రిల్ 18 : ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి పిలుపునిచ్చారు. బనగానపల్లె పట్టణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా బీసీ జనార్దన్రెడ్డి బోయపేట, ఖాజీవాడ, గౌండా వీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం బనగానపల్లె పట్టణానికి రింగ్ రోడ్డుకు రూ.50 కోట్ల రూపాయలు మంజూరు చేయించి రింగురోడ్డు నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారని అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆ టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా టెండర్లను పిలిచారన్నారు. అయితే రింగ్ రోడ్డుకు బైపాస్ అని పేరు మార్చడం తప్ప ఒక్క పని కూడా చేపట్టలేదని అన్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రింగురోడ్డు పూర్తి చేస్తామని బీసీ జనార్దరెరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సూపర్సిక్స్ పథకాల గురించి ప్రజలకు బీసీ జనార్దన్రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.