Share News

భర్త కోసం బైఠాయింపు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:58 PM

భర్త కోసం ఓ మహిళ శుక్రవారం నిరసనకు దిగింది.

భర్త కోసం బైఠాయింపు

కోవెలకుంట్ల, ఏప్రిల్‌ 26: భర్త కోసం ఓ మహిళ శుక్రవారం నిరసనకు దిగింది. భర్త ఇంటిముందు బైఠాయించింది. ఈ ఘటన మండలంలోని జోళదరాశి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వరప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన సునయానకు జోళదరాశికి చెందిన శివవర్ధన్‌రెడ్డితో 2018లో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితం కొంతకాలం సజావుగా సాగింది. వీరికి ఒక కూతురు ఉంది. మూడు సంవత్సరాల క్రితం కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి సునయన పుట్టింటి వద్దనే ఉంటుంది. శుక్రవారం సునయన జోళదరాశికి వచ్చి భర్త కోసం ఇంటి ముందు బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై ఆమెతోపాటు భర్త, బంధువులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Updated Date - Apr 26 , 2024 | 11:58 PM