‘వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి’
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:55 AM
రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.
![‘వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చాగలమర్రి, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని మల్లేవేముల గ్రామంలో వైసీపీ నాయకులు ఈదుల శంకర్రెడ్డి, నందీ వాహనరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఈదుల శేఖర్రెడ్డి, విఘ్నేశ్వర్రెడ్డి, ఓబయ్య, వెంకటేశ్వర్రెడ్డి, రాజారెడ్డిలతో పాటు 25 కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్ష్యంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ ఆళ్లగడ్డ నాయకులు భార్గవ్రామ్నాయుడు, మండల కన్వీనర్ నరసింహారెడ్డి, బీసీసెల్ స్పోక్పర్సన్ సల్లానాగరాజు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తి నరసింహులు, టీడీపీ నాయకులు ఈదుల ప్రతా్పరెడ్డి, రామనరసింహారెడ్డి, శేఖర్రెడ్డి, రమణారెడ్డి, భాస్కర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్, ప్రతా్పరెడ్డి పాల్గొన్నారు.