ఎన్నికల విధులపై అవగాహన
ABN , Publish Date - Feb 07 , 2024 | 12:51 AM
వచ్చే ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు నిర్వహించా ల్సిన విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించామని నంద్యాల ఆర్డీవో, ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికల అధికారి మల్లికార్జునరెడ్డి చెప్పారు.
![ఎన్నికల విధులపై అవగాహన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 6: వచ్చే ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు నిర్వహించా ల్సిన విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించామని నంద్యాల ఆర్డీవో, ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికల అధికారి మల్లికార్జునరెడ్డి చెప్పారు. ఆళ్లగడ్డ పట్ట ణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధం గా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన విధులు, బాధ్యతలు సక్ర మంగా నిర్వర్తించాలని సూచించామన్నారు. ఆళ్లగడ్డ అసెంబ్లీలోని పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల సంఖ్య తదితర వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కొత్తగా నియమితులైన తహసీ ల్దార్లు, బీల్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, టీడీపీ కౌన్సిలర్ హుసేన్ బాషా, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.