ఎన్నికల పరిశీలకుల నియామం
ABN , Publish Date - Apr 24 , 2024 | 11:53 PM
జిల్లాలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల సంఘం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు బుఽధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.శ్రీనివాసులు
నంద్యాల (కల్చరల్), ఏప్రిల్ 24: జిల్లాలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల సంఘం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు బుఽధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అతిఽథి గృహంలో డా.కె. శ్రీనివాసులు, ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్కుమార్ రెడ్డి ఎన్నికల పరిశీలకుడు పంకజ్కుమార్కు స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు.