రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడి మృతి
ABN , Publish Date - Jun 09 , 2024 | 12:01 AM
నగరంలో బంగారుపేట సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతున్న గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు.
![రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు, జూన్ 8: నగరంలో బంగారుపేట సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతున్న గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. మృతుడి శరీరంపై నలుపు రంగు టీషర్టు, దానిపైన పింక్ కలర్ అడ్డ గీతలు ఉన్నాయి. గ్రేక లర్ కాటన్ జీన్స్ పాయింటు ధరించి ఉన్నాడు. మృతుడి వయస్సు 30 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు భావిస్తు న్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9441970940 నెంబరుకు ఫోన్ చేయాలని హెడ్ కానిస్టేబుల్ కోదండరా ముడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు.